

భారతీయ రైల్వేలు టికెట్ రద్దు ఛార్జీలు, రిఫండ్ విధానంలో కీలక మార్పులు ప్రకటించాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయల్దేరే సమయాన్ని ఆధారంగా తీసుకుని రిఫండ్ విధానం అమలు చేయనున్నారు. కన్ఫర్మ్ టికెట్ను ప్రయాణానికి 72 గంటల ముందు రద్దు చేస్తే, క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఈ మార్పులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. వచ్చే నెల 1 నుంచి 15 మధ్య దశలవారీగా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త రూల్స్ ప్రకారం, 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే 25 శాతం ఛార్జీలు మినహాయించి రిఫండ్ ఇవ్వబడుతుంది. 24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం వరకు మినహాయింపు ఉంటుంది. ప్రయాణానికి 8 గంటల లోపు లేదా ట్రైన్ బయల్దేరిన తర్వాత రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు. అలాగే ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉన్న ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇంకా, కౌంటర్ టికెట్లను ఏ స్టేషన్లోనైనా రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇకపై ఇ-టికెట్లకు సంబంధించి టికెట్ డిపాజిట్ రిసీట్ (TDR) ప్రక్రియ కూడా ఆటోమేటిక్గా అమలవుతుంది, ప్రయాణికుడి ప్రత్యక్ష జోక్యం అవసరం ఉండదు. అంతేకాకుండా కౌంటర్ టికెట్ ప్రయాణికులు 30 నిమిషాల ముందు వరకు ప్రయాణ తరగతిని అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రస్తుతం ఉన్న క్యాన్సిలేషన్ ఛార్జీల విధానం ప్రకారం స్లీపర్, సెకండ్ క్లాస్, ఏసీ క్లాస్లకు వేర్వేరు రేట్లతో రుసుము వసూలు చేస్తున్నారు. 4 గంటల లోపు రద్దు చేస్తే రిఫండ్ అనుమతించకపోవడం కొనసాగుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.







.jpg&w=3840&q=75)












.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!