

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కారులో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వచ్చారు. సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఇద్దరూ కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగార్జున, భారత్ ఫ్యూచర్ సిటీ ఆలోచన అద్భుతమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ భవిష్యత్ నగరం ప్రణాళిక చాలా బాగుందని ప్రశంసించారు.
50 ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నానని, ఇక్కడి వాతావరణం, ప్రజల ఆతిథ్యం అద్భుతమని నాగార్జున అన్నారు. తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియో ఉందని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ ప్రముఖులతో కలిసి మరో అత్యాధునిక స్టూడియో నిర్మాణం జరగడం గొప్ప విషయమని తెలిపారు. అందరూ కలిసి వస్తే ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారీ నిర్మాణం సాధ్యమని, ఇది సినీ పరిశ్రమకు కొత్త ఊపిరి ఇస్తుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.


.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!