

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. పార్టీకి అండగా నిలిచిన ప్రజలకు, శ్రమించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రజల మనసు గెలవలేకపోయిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 40 శాతం గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కు వచ్చినట్టు, వేలాది సర్పంచులు గెలిచినట్టు గుర్తు చేశారు.
2020 మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. ప్రత్యక్షంగా పలు చోట్ల గెలుపు సాధించామని, హంగ్ వచ్చిన అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నట్టు పేర్కొన్నారు. డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దుర్వినియోగం జరిగినా ఓటర్లు భయపడకుండా ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సింగరేణి అంశంపై మాట్లాడుతూ, అక్కడ జరుగుతున్న అవకతవకలను అడ్డుకోవడానికి సీపీఐతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. అవసరమైతే హంగ్ ప్రాంతాల్లో మద్దతు విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!