

నిబంధనలు ఉన్నప్పటికీ పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్ల వినియోగం ఇంకా కొనసాగుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి ద్వితీయ భాష పరీక్ష ప్రశ్నపత్రాలు మూడు కేంద్రాల నుంచి బయటకు లీక్ కావడం కలకలం రేపింది. పరీక్ష పూర్తికాకముందే వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. తనిఖీలు సరిగా లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు ఫోన్లు లోపలికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యాశాఖ అప్రమత్తమై, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
క్యూఆర్ కోడ్ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు హెచ్ఎంలతో పాటు మొత్తం 9 మందిని సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా వికారాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. ఇకపై పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జీరో మొబైల్ జోన్గా మార్చాలని, ప్రతి సిబ్బంది తమ వద్ద సెల్ఫోన్ లేదని నిర్ధారించాల్సిందిగా ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఆదేశించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!