
రాజకీయాలు

సజ్జనార్ నీట్ యూజీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మెడికల్ సీట్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, తక్కువ మార్కులతో మేనేజ్మెంట్ కోటా లేదా విదేశీ కాలేజీలలో సీట్లు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని సూచించారు.
విదేశీ మెడికల్ కాలేజీలకు వెళ్లే ముందు జాతీయ వైద్య కమిషన్ గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలని చెప్పారు. దళారులకు నగదు ఇవ్వకుండా, ఫీజులను నేరుగా కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే 100కు కాల్ చేసి లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!