
క్రీడలు

తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ సెన్సార్ వివాదాల కారణంగా వాయిదా పడింది. ఈ వివాదం కోర్టుకు చేరడంతో ఎన్నికల ముందు విడుదల కాలేకపోయింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమితా బైజు, ప్రియమణి, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు పూజా హెగ్డే విజయ్ను చూపించగా, ఆయన సిగ్గుపడుతూ కనిపించారు. ఈ వీడియోపై నెటిజన్స్ సరదాగా స్పందిస్తూ, ఆమె ముందే ఫలితాన్ని ఊహించిందా అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆమె కాన్ఫిడెన్స్ను ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!