

జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఘట్టం ఇది. అబుధాబిలో సంవత్సరాలుగా నివసిస్తున్న తెలుగు వ్యక్తి అనిల్ కుమార్ బొల్లా (29) యూఏఈ లాటరీలో రూ.240 కోట్లు (AED 100 మిలియన్) గెలుచుకున్నారు. యూఏఈ లాటరీ చరిత్రలో ఇంత భారీ మొత్తం గెలుచుకున్న మొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. తన గెలుపు సమాచారం అందుకున్నప్పుడు అనిల్ ఇంట్లోనే ఉన్నారు. ఆ క్షణం నమ్మశక్యంగా అనిపించలేదని, ఇంకా కలలా అనిపిస్తోందని తెలిపారు. ఈ విజయం తర్వాత కుటుంబంతో లగ్జరీ వెకేషన్కి వెళ్లి, మిగతా మొత్తాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన ఎంపిక చేసిన లక్కీ నంబర్లు తన తల్లి పుట్టిన నెల ఆధారంగా ఎంచుకున్నవే. అదే ఆయనకు అదృష్టం తెచ్చి పెట్టింది. దీపావళి ముందు వచ్చిన ఈ విజయం అనిల్కి మరింత ప్రత్యేకంగా మారింది.
ఈ రికార్డ్-బ్రేకింగ్ డ్రాలో మరో 10 మంది విజేతలు కూడా ఉన్నారు, అయితే అనిల్ విజయం UAE లాటరీ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది, ఇది తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది.





.avif&w=3840&q=75)




కామెంట్స్ (1)
Wishing him even more success ahead