

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త అంతర్జాతీయ ప్రమాణాల జూ ఏర్పాటుకు కీలక అడుగు వేసింది. నాల్గో నగరంలో జూ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖేష్ అంబానీకి చెందిన వంతరా జూతో MoU కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా కొత్త జూ రూపకల్పన, సాంకేతిక సూచనలు, అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలపై మార్గదర్శకతను పొందనున్నట్లు తెలిపింది. వంతరా జూ ప్రపంచవ్యాప్తంగా జంతు సంరక్షణ, పునరావాసం, శాస్త్రీయ నిర్వహణలో ప్రసిద్ధి చెందింది మరియు తెలంగాణ కొత్త జూ కి ఈ నమూనాలను ఉపయోగించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది.
ఈ MoU ప్రధానంగా జంతు సంరక్షణ, పునరావాస, నైట్ సఫారీ రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, ఫారెస్ట్-బేస్డ్ ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానాలు, ఆధునిక ఎంక్లోజర్లు, వన్యప్రాణి సంక్షేమ ప్రమాణాలు, సందర్శకుల అనుభవం మెరుగుపరచడం వంటి అంశాల్లో సహకారాన్ని అందిస్తుంది. కొత్త జూ దేశంలోనే కాక ఆసియా స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా, అంతర్జాతీయ మోడల్గా ఎదుగుతుందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సి సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ MD సునీత భగవత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!