
న్యూస్

తెలంగాణలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు మరోసారి ఆపరేషన్ క్రాక్డౌన్ చేపట్టారు. మ్యూల్ అకౌంట్లపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. మొత్తం 137 పోలీస్ బృందాలు కలిసి దాదాపు 500 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ చర్యల్లో సైబర్ సెక్యూరిటీ విభాగం 1,888 మ్యూల్ అకౌంట్లను గుర్తించింది. ఈ అకౌంట్ల ద్వారా జరిగిన మోసాల వల్ల సుమారు రూ.100 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ అక్రమాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మ్యూల్ అకౌంట్లకు సంబంధించిన కేసుల్లో ఇప్పటివరకు 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అలాగే 626 మంది అనుమానితులను గుర్తించి, వారిలో 208 మందిని అరెస్ట్ చేశారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇటువంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!