
టెక్నాలజీ

కడపలోని శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండానే పాఠశాల యాజమాన్యం బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. తొమ్మిదో తరగతి విద్యార్థిని జశ్వంతి మృతదేహం ప్రస్తుతం మార్చురీలో ఉంచబడింది. స్కూల్ యాజమాన్యం చర్యల వల్లే తమ కూతురు ఈ దారుణ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు తల్లిదండ్రులు చేస్తున్నారు. మృతదేహాన్ని పాఠశాలకు తరలించేందుకు బంధువులు ప్రయత్నించడంతో మార్చురీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
తమ బిడ్డ మృతికి కారణమైందేంటో స్పష్టత ఇవ్వాలని, బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసనకు సిద్ధమవుతున్నారు.











కామెంట్స్ (2)
Heartbreaking
sad to hear