

ప్రదీప్ రంగనాథన్ తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలతో 100 కోట్ల క్లబ్లో చేరిన ఆయన, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ప్రదీప్, అదే బ్యానర్తో మరోసారి కొత్త ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి వైవిధ్యమైన కథలతో పేరు గాంచిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించనున్నారు.
అనుకోకుండా ఒక రోజు, సాహసం, మనమంతా వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యేలేటి, ఈసారి యాక్షన్ థ్రిల్లర్తో రాబోతున్నారు. ప్రదీప్ యూత్ఫుల్ ఎనర్జీ, కామెడీ టైమింగ్కు యేలేటి లోతైన కథనం జత కలిస్తే సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉండగా, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించనున్నారు. ఇదే సమయంలో ప్రదీప్ రూ.50 కోట్ల పారితోషికం కోరుతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!