
రాజకీయాలు

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో మార్కుల నమోదు, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఈసారి కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 4 నుంచి 10 వరకు జరిగే మూల్యాంకనానికి ఇంటర్మీడియట్ నిబంధనలను అమలు చేయనున్నారు. గత ఏడాది మార్కుల లెక్కింపులో జరిగిన తప్పిదాల నేపథ్యంలో, తప్పు చేసిన సిబ్బందికి జరిమానాలు విధించేలా నిర్ణయం తీసుకున్నారు. ట్యాబ్ల ద్వారా మార్కులు నమోదు చేయడం వల్ల పొరపాట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ఏదైనా లోపం గుర్తిస్తే కమిషనర్, డైరెక్టర్కు నివేదిక పంపించి, సిబ్బందికి నోటీసులు జారీ చేసి వివరణ కోరిన తర్వాత చర్యలు తీసుకుంటారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!