

వెంకట్ యాదవ్, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, కుక్కల రక్తాన్ని మనుషులకు ఉపయోగించలేమని స్పష్టం చేస్తూ ఆరోపణలను ఖండించారు. అలాంటి విషయాల్లో ఎలాంటి అక్రమాలు జరగవని తెలిపారు. కేన్సర్, టిక్ ఫీవర్ వంటి అరుదైన పరిస్థితుల్లో మాత్రమే కుక్కలకు రక్తం ఎక్కిస్తామని చెప్పారు. తమ ఆసుపత్రిలో ల్యాబరేటరీలు ఏర్పాటు చేసి, అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లతో సేవలు అందిస్తున్నామని, దీంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని వివరించారు.
ఇటీవల తమ ఆసుపత్రి రిఫరల్ హాస్పిటల్గా ఎదగడంతో హైదరాబాద్లోని కొంతమంది కార్పొరేట్ శక్తులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మరో ఆసుపత్రి నుంచి తీసుకున్న కొంతమంది సిబ్బంది పక్కా ప్రణాళికతో వచ్చి ఇన్పేషెంట్ వార్డులో ఫోటోలు, వీడియోలు లీక్ చేశారని తెలిపారు. ఇందులో కొంతమంది డాక్టర్లు, సిబ్బంది కూడా పాల్గొన్నారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, అలాగే పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు వెల్లడించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!