

తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) సిబ్బంది సంక్షేమాన్ని మరింత మెరుగుపరచే దిశగా, ఎస్పీఎఫ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మధ్య సికింద్రాబాద్లోని ఎస్పీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఎస్పీఎఫ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర జీతాల ప్యాకేజీ అమలులోకి రానుంది.
ఈ ప్యాకేజీ ద్వారా ఎస్పీఎఫ్ సిబ్బందికి ప్రమాద మరణ బీమా రూ.100 లక్షల వరకు, విమాన ప్రమాద బీమా రూ.160 లక్షల వరకు, శాశ్వత వైకల్యానికి రూ.80 లక్షల వరకు మరియు గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.10 లక్షల వరకు కల్పించనున్నారు. అదనంగా పిల్లల విద్యా సహాయం, బాలికల వివాహ ప్రయోజనాలు, ఎయిర్ అంబులెన్స్, కాలిన గాయాల చికిత్స వంటి ప్రత్యేక అదనపు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ఉగ్రవాద, నక్సలైట్ లేదా శత్రు దాడుల్లో మరణించిన సిబ్బందికి అదనంగా రూ.10 లక్షల ప్రమాద బీమా కవరేజ్ కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటుంది. బీమాతో పాటు రుణ సౌకర్యాలు, లాకర్ అద్దెపై రాయితీలు, ప్లాటినమ్ రూపే డెబిట్ కార్డులు కూడా కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, ఐపీఎస్, ఎస్పీఎఫ్ అవసరాలకు అనుగుణంగా ప్యాకేజీ రూపొందించినందుకు ఎస్బీఐకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇరు సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యం కొనసాగాలని ఆకాంక్షించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!