
టెక్నాలజీ
.jpeg&w=3840&q=75)
సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) జనవరి 10, 2026న ఒక్క రోజులోనే రూ.1.22 కోట్ల టికెట్ చెకింగ్ ఆదాయాన్ని నమోదు చేసింది. ఎస్సీఆర్ పరిధిలోని పలు రైళ్లలో, స్టేషన్లలో నిర్వహించిన విస్తృత తనిఖీల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరింది. నిజమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడం, ఆదాయ పరిరక్షణను బలోపేతం చేయడమే ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు.
టికెట్ లేకుండా ప్రయాణాన్ని అరికట్టేందుకు రైల్వే యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. సరైన టికెట్తో ప్రయాణించడం ద్వారా జరిమానాలను తప్పించుకోవడమే కాకుండా, రైల్వే సేవలు సురక్షితంగా, క్రమబద్ధంగా సాగేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రయాణికులుగా వ్యవహరించాలని ప్రయాణికులకు ఎస్సీఆర్ విజ్ఞప్తి చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!