
టెక్నాలజీ

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. బస్సు ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా పొగ రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని ఆపి ప్రయాణికులను కిందికి దించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు.
















కామెంట్స్ (2)
Good to hear everyone is safe.
Major mishap avoided