

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. గ్యాస్ ఏజెన్సీలకు గతంతో పోలిస్తే సుమారు 20 శాతం తక్కువగా సరఫరా అవుతుండగా, ఇప్పటికే దాదాపు 40 శాతం డెలివరీలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు రోజుకు సుమారు 4 వేల టన్నుల గ్యాస్ అవసరం ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కేవలం 14 వేల టన్నుల నిల్వ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల వరుసగా వచ్చిన సెలవుల కారణంగా ఉత్పత్తి అంతరాయం కలగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. సరఫరా లోటు కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పీఎన్జీ వినియోగానికి నెలకు సుమారు రూ.1,000 ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. పరిస్థితులు మరింత దిగజారితే మళ్లీ కిరోసిన్ వినియోగాన్ని ప్రోత్సహించే పరిస్థితి రావచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!