

దేశవ్యాప్తంగా పాన్ మసాలా వ్యాపారులకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిమాణం లేదా బరువు ఎంత ఉన్నా, అన్ని పాన్ మసాలా ప్యాకేజీలపై రిటైల్ సేల్ ధర (RSP)తో పాటు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011లో పేర్కొన్న డిక్లరేషన్లు తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేసింది.
ఈ నిబంధనలు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పేర్కొన్న తేదీ నుంచి దేశంలోని అన్ని తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు ఈ నిబంధనలు అనుసరించాల్సిందేనని శాఖ తెలిపింది.
ఇప్పటివరకు 10 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువున్న చిన్న ప్యాక్లు కొంతమంది డిక్లరేషన్ల నుంచి మినహాయింపు పొందేవి. కానీ కొత్త నియమాలతో ఆ సడలింపులు రద్దయ్యాయి. ఇకపై చిన్న ప్యాక్లు కూడా రిటైల్ ధరను స్పష్టంగా ముద్రించాలి, 2011 నియమాల ప్రకారం అన్ని వివరాలను చూపాలి.
ఈ నిర్ణయం వల్ల అన్ని పరిమాణాల ప్యాకెళ్లలో ధరల పారదర్శకత పెరుగుతుందని, చిన్న ప్యాక్లపై మోసపూరిత ధరలను అరికట్టవచ్చని వినియోగదారుల వ్యవహారాల విభాగం స్పష్టం చేసింది. వినియోగదారులు సరైన సమాచారంతో ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!