

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్కేఎల్ఐఎస్), కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, కోయిల్సాగర్ ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, గూడెందొడ్డి రిజర్వాయర్ తదితర ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించనున్నారు. సోమశిలలో బస చేయనున్న సీఎం, అక్కడే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
రెండో రోజు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)కు సంబంధించిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన, ఉద్దండాపూర్ ప్రాంతాల్లోని రిజర్వాయర్లు, పంప్హౌస్లు, కాలువల పనులను పరిశీలించనున్నారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా ఉద్దండాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడం, నీటి వనరుల వినియోగాన్ని మెరుగుపరచడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!