
గాసిప్స్

విజయవాడలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే బస్సులపై భారీ ధరలు విధిస్తున్నట్లు ప్రయాణికులు అంటున్నారు. ఏసీ స్లీపర్ బస్సులకు సాధారణంగా ఉండాల్సిన చార్జీలకంటే చాలా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విజయవాడ–హైదరాబాద్ రూట్లో ఏసీ స్లీపర్కు రూ.2700, సెమీ స్లీపర్కు రూ.1700 వరకు తీసుకుంటున్నారు. అలాగే విజయవాడ–బెంగళూరు ఏసీ స్లీపర్ బస్సుకు సుమారు రూ.4000 వరకు వసూలు చేస్తున్నారు. ప్రయాణ దూరాన్ని బట్టి చూస్తే, ఈ చార్జీలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!