
న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!