

సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కొంతమంది పాపులారిటీ కోసం, వ్యూస్, లైక్స్ కోసం తప్పుడు వీడియోలు, వార్తలు సృష్టిస్తున్నారు. తాజాగా, ఈ నెల 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు ఉన్నట్లు ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావడం సామాజిక వలయంలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు, సీపీ సజ్జనార్ అధికారికంగా ప్రకటన చేసి, ఏ విధమైన రాయితీలు కూడా ప్రకటించలేదని స్పష్టంచేశారు. ఇది పూర్తిగా మోసం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మాత్రమే. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి, షేర్ చేయకండి. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటం, అధికారిక ఆప్ల, వెబ్సైట్ల ద్వారా మాత్రమే సమాచారం పొందడం అత్యంత ముఖ్యమని పోలీసులు సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!