

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. మంగళవారం బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును విచారించిన సిట్, శుక్రవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణకు పిలిచింది. ఈ మేరకు కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లలో ఉండటంతో, నందినగర్లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. చట్టంపై గౌరవం ఉందని, విచారణకు హాజరవుతానని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయి సిట్ నోటీసులపై చర్చించినట్లు సమాచారం.
ఇటీవల తెలంగాణ రాజకీయాలు వరుస విచారణలు, దర్యాప్తుల చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. పోలీసులను, ప్రతిపక్షాన్ని వేధించేందుకే ఈ దర్యాప్తులు జరుగుతున్నాయని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ట్రాష్గా అభివర్ణిస్తూ, రెండేళ్లుగా పెద్ద డ్రామా నడుస్తోందన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తూ, చట్టప్రకారం చర్యలే తప్ప వ్యక్తిగత కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!