
జనరల్

బెంగళూరు నుంచి నాగ్పూర్కు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మధ్య గాల్లో సమస్యను గుర్తించిన పైలెట్ వెంటనే శంషాబాద్ (హైదరాబాద్) విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. పరిస్థితిని చాకచక్యంగా నిర్వహించడంతో ప్రయాణికుల్లో ఎలాంటి భయాందోళనలు చోటుచేసుకోలేదు.
126 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానం సురక్షితంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా అందరూ క్షేమంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. పైలెట్ మరియు గ్రౌండ్ సిబ్బంది సమయోచిత చర్యలతో ప్రమాదం తప్పి అందరికీ ఉపశమనం కలిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!