

గత నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటులో తెలుగుదేశం పార్టీకి ఉన్న విశిష్ట స్థాయిని మరోసారి చాటుతూ, కొత్తగా ఎన్నికైన ఎంపీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి లోక్సభలో తన ముద్ర వేశారు. నిన్న జరిగిన ఉద్రిక్త సమావేశంలో అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఆయన, సభా మర్యాదలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ధీటైన తీరు ప్రదర్శించారు. ఆయన వ్యవహార శైలి టీడీపీ పార్లమెంటరీ సంప్రదాయానికి మరో బలమైన ఉదాహరణగా నిలిచింది.
సభలో గందరగోళం నెలకొన్న సమయంలో, కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ ‘యార్’ అనే పదంతో అధ్యక్ష స్థానాన్ని సంబోధించడాన్ని కృష్ణ ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, ఆ పదం వినియోగం మాత్రమే కాకుండా, టేబుల్ దగ్గరకు వచ్చి పత్రాలు చించివేయడం, విసిరేయడం వంటి చర్యలు కూడా అభ్యంతరకరమని తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ అయిన కృష్ణ ప్రసాద్, తన అనుభవంతో ప్రతిపక్ష సభ్యుల అవమానకర ప్రవర్తనకు ఎక్కడా తావివ్వలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!