
.jpg&w=3840&q=75)
పార్లమెంట్ కార్యకలాపాలను అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల నుంచే అన్ని భాషల అనువాద వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
సభ్యులు తమకు ఇష్టమైన మాతృభాషలో మాట్లాడే పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. 2027 నాటికి పార్లమెంట్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ప్రతి భాషలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
అదే విధంగా, డిజిటల్ సంసద్ యాప్ ద్వారా అన్ని రాష్ట్రాల బడ్జెట్ ప్రతులను ఒకే వేదికపై అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ పనితీరును మరింత పారదర్శకంగా, ప్రజలకు దగ్గరగా తీసుకురావడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు లోక్సభ స్పీకర్ వెల్లడించారు.
_1771477764226.jpg&w=3840&q=75)







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!