

భారత అంతరిక్ష రంగానికి ప్రపంచవ్యాప్తంగా విశేష గౌరవం లభిస్తోందని వ్యోమగామి శుభాంశు శుక్లా తెలిపారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల దిశగా దేశం అడుగులు వేయడం గొప్ప పరిణామమని, ఇది అంతర్జాతీయ రోదసి పోటీలో భారత్కు ప్రత్యేక స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. గత ఏడాది యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేసిన తన యాత్రను గుర్తుచేసుకుంటూ, వచ్చే ఏడాది చేపట్టనున్న ‘గగన్యాన్’ మిషన్ విజయవంతమైతే అనేక దేశాలకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
రోదసిలో తన అనుభవాలను వివరించిన శుక్లా, అక్కడి జీవనం కచ్చితమైన టైమ్టేబుల్తో సాగుతుందని తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే దినచర్య, సాయంత్రం వరకు కొనసాగుతుందని చెప్పారు. ఐఎస్ఎస్ కిటికీ నుంచి విశ్వాన్ని చూస్తూ టీ తాగడం ప్రత్యేక అనుభూతినిస్తుందని తెలిపారు. భూమి, చంద్రుడిని చూసే క్షణాలు అద్భుతంగా అనిపించాయని, అయితే కొన్నిసార్లు ఒంటరితనం, భావోద్వేగాలు ఎదురయ్యాయని చెప్పారు. వాటిని అధిగమిస్తూ తన పనిపై దృష్టి పెట్టానని వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!