

తెలంగాణ గద్దర్ చిత్ర పురస్కారాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పురస్కారాలను అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. గద్దర్ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన మహానీయుడని, ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం గౌరవంగా ఉందన్నారు. హైదరాబాద్ కేవలం సాంకేతిక కేంద్రం, వంటకాలకే పరిమితం కాకుండా చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ వంటి మహానుభావులు తెలుగు చిత్ర పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు.
రామోజీ రావు చిత్రపురిని ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. దాసరి నారాయణ రావు వంటి ప్రముఖులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ చిత్ర కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని పేర్కొంటూ, గద్దర్ స్ఫూర్తితో సామాజిక సమస్యలపై అవగాహన కలిగించే చిత్రాలు రూపొందించాలని పిలుపునిచ్చారు.




.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)



.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!