
రాజకీయాలు

యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీవీకే 98కి పైగా సీట్లు గెలుచుకుంటుందని చేసిన తమ అంచనాను మొదట్లో అందరూ నవ్వి కొట్టిపారేశారని తెలిపారు. అయితే ఇప్పుడు తమ డేటా ఆధారిత అంచనాలే నిజమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
డీఎంకే, టీవీకే, అన్నాడీఎంకే ఓట్ల శాతంపై తమ అంచనాలు ప్రస్తుత ట్రెండ్స్కు దగ్గరగా ఉన్నాయని ఆయన వివరించారు. యువత, మహిళల మద్దతుతో టీవీకే బలంగా ఎదిగిందని తెలిపారు. తుది ఫలితాల తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని ఆయన అన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!