

కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపన అనంతరం పాలమూరు నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 8న ముందుగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం ప్రజాసభలో పాల్గొననున్నారు.
‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ’’ పేరుతో చౌదరిగూడెం సమీపంలోని కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రాజెక్టు పూర్తి, జలాల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రాంతీయ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యాలని కవిత స్పష్టం చేస్తున్నారు.
11 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయించేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్లో తెలంగాణ రక్షణ సేన నాయకులు సభ పోస్టర్ను ఆవిష్కరించి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!