
క్రీడలు

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన ఎన్డీఏకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలోనే నవ భారత నిర్మాణం సాధ్యమని అన్నారు. అలాగే తమిళనాడులో విజయం సాధించిన విజయ్ కు, ఆయన పార్టీ టీవీకే కు శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి నాయకులు సృష్టించిన ప్రభంజనాన్ని ఇప్పుడు విజయ్ కొనసాగిస్తున్నారని అన్నారు. నటులు చరిత్రను తిరగరాయగలరని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. తమిళ ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా విజయ్ పాలన సాగాలని ఆకాంక్షించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!