
గాసిప్స్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు తిరిగి పంపించింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జ్షీట్ను రిటర్న్ చేసిన కోర్టు, దాఖలులో సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసులో నటుడు అల్లుఅర్జున్ సహా మొత్తం 23 మందిపై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
పోలీసులు సమర్పించిన పత్రాల్లో అవసరమైన హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడం వంటి లోపాలను కోర్టు సూచించింది. పూర్తి ఆధారాలతో మళ్లీ సమర్పించాలని ఆదేశించింది. ఈ పరిణామం కేసు విచారణలో మరో కీలక మలుపుగా భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!