

కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదోని డివిజన్ కపటి గ్రామ శివారులోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఓ వలస కూలీ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీలో గ్రానైట్ రాళ్లను ప్రాసెస్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ రాతి బండ ఒక్కసారిగా ఎగిరి కార్మికుడిపై పడింది. బండరాయి బలంగా తగలడంతో సదరు కార్మికుడు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని రాజమాల్గా గుర్తించగా, ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికుడని సహచరులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఆదోని రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, ఫ్యాక్టరీలో భద్రతా చర్యలు పాటించారా లేదా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన నేపథ్యంలో ఫ్యాక్టరీలు, మైనింగ్ ప్రాంతాల్లో కనీస భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!