

ఐపీల్ లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో గెలుపుతో ఖాతా తెరవాలని భావించిన కోల్కతా ఆశలు నెరవేరలేదు. మూడు గంటలకు పైగా కురిసిన వర్షం వల్ల కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఔట్ఫీల్డ్లో అనేక చోట్ల నీరు నిల్వ ఉండటంతో ఆట కొనసాగించడం అసాధ్యమైంది. పరిస్థితులను పరిశీలించిన అంపైర్లు కెప్టెన్లు అజింక్య రహానే మరియు శ్రేయాస్ అయ్యర్ కు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇద్దరు కెప్టెన్లు అంగీకరించి పరస్పరం హ్యాండ్షేక్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ రద్దుతో వరుసగా మూడో విజయం సాధించాలని భావించిన పంజాబ్ నిరాశకు గురైంది. మరోవైపు సీజన్లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న కోల్కతా కూడా నిరుత్సాహానికి లోనైంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!