

‘ది కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలకు ముందు కోర్టులో ప్రదర్శించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాలో కేరళ రాష్ట్రాన్ని తప్పుగా చూపించారనే ఆరోపణలు, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలు ఉన్నాయనే ప్రజల ఆందోళనల నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర పేరును సినిమా టైటిల్లో ఉపయోగించినందున ఈ అంశాన్ని పరిశీలించడం అవసరమని హైకోర్టు పేర్కొంది.
సెన్సార్ సర్టిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు సాధారణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకోదని తెలిపింది. అయితే వివాదాల దృష్ట్యా ఈ నెల 25న సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, అనంతరం సెన్సార్పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’కు సీక్వెల్గా తెరకెక్కింది. ఇటీవల సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుండగా, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!