
క్రీడలు

హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ, తూర్పు హైదరాబాద్లోని ఎల్బీ నగర్, సరూర్నగర్, మలక్పేట్, చార్మినార్, బీఎన్ రెడ్డి, నాగోల్, ఉప్పల్, అంబర్పేట్, వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో ప్రస్తుతం నెమ్మదిగా కదిలే తుఫాను మేఘాలు ప్రభావం చూపుతున్నాయి. వచ్చే 30 నుంచి 45 నిమిషాల పాటు భారీ వర్షం, మెరుపులు, ఈదురుగాలులు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.
ఇక సాయంత్రం 6 గంటల తర్వాత వికార్బాద్ వైపు నుంచి వచ్చే మేఘాల ప్రభావంతో సెర్లింగంపల్లి, రాజేంద్రనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రజలు అవసరం లేని ప్రయాణాలు నివారించడంతో పాటు మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!