
గాసిప్స్

ఇండిగో విమానాల సమస్యలు కొనసాగుతుండటంతో ఢిల్లీ ఆర్థిక కార్యకలాపాల పై పెద్ద ప్రభావం పడింది. ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అంచనా ప్రకారం, గత కొన్ని రోజులలోనే వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు సుమారు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లింది.
విమానాల రాకపోకలు అంతరాయం కావడంతో వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని సంస్థ తెలిపింది.
ఢిల్లీ మార్కెట్లలో గత 10 రోజుల్లో జనసంచారం దాదాపు 25% తగ్గిందని కూడా సంస్థ వివరించింది.
ఢిల్లీ విమానాశ్రయం నుంచి రోజూ సుమారు 1.5 లక్షల మంది ప్రయాణిస్తారని, అందులో దాదాపు 50 వేల మంది వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేసే వారు ఉంటారని ఛాంబర్ పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!