
న్యూస్

హైదరాబాద్ శంషాబాద్లోని స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ క్యాంపస్ నుంచి తొలి కమర్షియల్ రాకెట్ విక్రమ్–1 ను ఆవిష్కరించారు.
స్కైరూట్ సంస్థ అభివృద్ధిని ప్రశంసించిన మోదీ, ఇది భారత అంతరిక్ష పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు. భారత యువత నైపుణ్యాన్ని, ఆవిష్కరణ శక్తిని స్కైరూట్ బలంగా ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రైవేటు రంగం పాల్గొనడం వల్ల భారత అంతరిక్ష రంగం మరింత ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.












.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!