

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోవడం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు కీలక విజయంగా మారింది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ (కుమ్మ దాదా), మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామంతో మావోయిస్టు పార్టీ ప్రభావం క్రమంగా తగ్గిపోతోందనే చర్చలు రాజకీయ, భద్రతా వర్గాల్లో జరుగుతున్నాయి.
మరోవైపు మాజీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీ కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, భారత్కు తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గణపతి కూడా లొంగిపోతే మావోయిస్టు పార్టీ శకం దాదాపు ముగిసినట్టేనని అధికారులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్-2 వంటి చర్యలు, నిరంతర కూంబింగ్ ఆపరేషన్లు మావోయిస్టు శక్తిని బలహీనపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!