

ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధితో విశాఖ నగరం వేగంగా ముందుకు సాగుతోంది. దీని ప్రభావంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయితే డిమాండ్కు అనుగుణంగా కొత్త విమానాలు ప్రారంభించాల్సిన పరిస్థితిలో, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే పుణె, గోవా, కౌలాలంపూర్, బ్యాంకాక్ విమానాలు నిలిచిపోగా.. త్వరలో శ్రీవిజయపురం (పోర్టు బ్లెయిర్) సర్వీసు కూడా నిలిచే అవకాశముంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రూట్లను పునరుద్ధరించాలని నగరవాసులు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరుతున్నారు.
దాదాపు 13 ఏళ్లుగా విశాఖ–పోర్టు బ్లెయిర్ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నేరుగా విమాన సేవలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు (మంగళవారం, గురువారం) ఈ సర్వీసులు నడుస్తున్నప్పటికీ, తాజా వేసవి షెడ్యూల్ ప్రకారం త్వరలోనే అవి నిలిచిపోనున్నాయి. మే నెల నుంచి టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో లేకపోవడం దీనికి సంకేతంగా మారింది. అలాగే గతంలో రోజుకు రెండు సర్వీసులు నడిచిన విశాఖ–ముంబయి రూట్లో ప్రస్తుతం ఒక్క విమానం మాత్రమే కొనసాగుతోంది. గోవా, పుణె రూట్లలో 80 నుంచి 90 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ 2024లో అవి నిలిచిపోవడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!