

బొలీవియా రాజధాని లాపాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో కరెన్సీ తరలిస్తున్న హెర్క్యూలెస్ సీ-130 కార్గో విమానం ఘోర ప్రమాదానికి గురైంది. శాంటాక్రూజ్ నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిది మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం రన్వేపై నుంచి జారి పక్కనే ఉన్న రద్దీ రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 15 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, 31 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
మృతులు, గాయపడిన వారిలో అధిక శాతం రోడ్డుపై ప్రయాణిస్తున్న పౌరులేనని రక్షణ శాఖ వెల్లడించింది. కొత్తగా ముద్రించిన కరెన్సీని సెంట్రల్ బ్యాంకు నుంచి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన నోట్లను సేకరించేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై కొందరు దాడి చేయగా, దాదాపు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!