
గాసిప్స్

సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనల రూపంలో ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఏఐ సాయంతో రూపొందించిన వీడియోలతో యువతను ఆకర్షించి, ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు హనీట్రాప్ వల విసురుతున్నారు.
ఇలాంటి యాప్లను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఫోన్లోని కాంటాక్ట్స్, ఫోటోలు వారి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వీడియో కాల్స్ ద్వారా మోసం చేసి, మోర్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేయవద్దని, బాధితులు వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!