
సినిమాలు

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ నేత అభినయ్ రెడ్డి, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, ఆటోను ఎడ్లబండిపై ఉంచి ర్యాలీ నిర్వహించడాన్ని రష్మీ తప్పుబట్టారు. రాజకీయాల కోసం మూగజీవాలను ఉపయోగించడం చాలా తప్పు అని ఆమె అన్నారు.
ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ రావడంతో రష్మీ స్పందించారు. తాను ఏ మతానికీ, ఏ రాజకీయ పార్టీకీ వ్యతిరేకం కాదని, జంతువులపై జరిగే హింసను మాత్రమే వ్యతిరేకిస్తానని చెప్పారు. గతంలో జంతు బలులు, ఏనుగులపై హింస గురించి మాట్లాడినప్పుడు కూడా తనను దూషించారని ఆమె తెలిపారు. జంతు సంక్షేమం కోసం నిజంగా పని చేసే పార్టీకి తాను మద్దతు ఇస్తానని చెప్పారు. విమర్శలు చేయడం మానేసి జంతువులపై జరుగుతున్న హింసను ఆపాలని ట్రోలర్లకు సూచించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!