
జనరల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం విప్లు కళ్లు, చెవులుగా పనిచేస్తారని అన్నారు. శనివారం MCRHRDలో జరిగిన శాసనసభ, శాసనమండలి విప్ల సమావేశంలో ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, సాగునీటి అవసరాలు, ధాన్యం సేకరణ పురోగతి వంటి అంశాలను విప్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ప్రజలతో నిరంతరం సంబంధం కొనసాగిస్తూ స్థానిక అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. వారానికి ఒక రోజు విప్లకు అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!