
ఓటీటీ

దేశ రాజధాని దిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఏసీ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 4 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 14 వాహనాలతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా రక్షించారు. ఇంకా మరికొంతమంది ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!