
గాసిప్స్
.webp&w=3840&q=75)
పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించనున్నారు. ఈ ఏడాది ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్తో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు లభించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగివచ్చిన అనంతరం ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి సహా పలువురు పద్మ అవార్డు గ్రహీతలను సీఎం ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా పద్మ అవార్డులకు ఎంపికైన వారిని ప్రభుత్వం గౌరవించనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!