
గాసిప్స్

కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానాన్ని హైజాక్ చేస్తామని దుండగులు హెచ్చరించినట్లు సమాచారం. ఈ బెదిరింపు నేపథ్యంలో విమానయాన అధికారులు అప్రమత్తమయ్యారు.
భద్రతా చర్యలలో భాగంగా విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్వహించారు. వెంటనే భద్రతా బలగాలు, బాంబు నిర్వీణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన అనంతరం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!