

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు మరో కీలక శుభవార్త అందించింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం సాగించేందుకు వీలుగా కొత్త పథకాన్ని నేటి నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రూ.30 వేల పరిమితితో ప్రత్యేక క్రెడిట్ కార్డులు అందించనున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా, అత్యవసర సమయంలో వడ్డీ లేకుండా డబ్బులు వినియోగించుకునే అవకాశం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. తొలుత దీనిని పైలట్ ప్రాజెక్టుగా తిరుపతి జిల్లాలో అమలు చేస్తుండగా, అర్హులైన సుమారు 7 వేల మంది వీధి వ్యాపారులకు శుక్రవారం క్రెడిట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డు ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇదే సమయంలో వీధి వ్యాపారుల కోసం అమలవుతున్న పీఎం స్వనిధి పథకం ద్వారా రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశమూ ఉంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా మూడు విడతలుగా ఈ రుణాలు మంజూరు చేస్తారు. తొలి విడతలో రూ.10 వేలు, సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల వరకు లోన్ అందిస్తారు. రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ పథకం తిరుపతి జిల్లాలో అమల్లో ఉండగా, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ చర్యలతో వీధి వ్యాపారులకు ఆర్థిక భద్రత పెరిగి, వారి వ్యాపారాలు మరింత స్థిరంగా సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!