

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఇటుక్యాలపాడు స్టేజ్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి 44 పై అదుపుతప్పి పల్టీ కొట్టడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
అధికారుల ప్రకారం గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా అతివేగం లేదా డ్రైవర్ అలసట ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెలుగులోకి రానున్నాయి. ప్రమాదంతో కొద్దిసేపు ఎన్హెచ్ - 44 పై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినా తర్వాత సాధారణ స్థితికి వచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!