

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రెండు రోజుల ముంబయి పర్యటన విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన 21 వ హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా (HICSA 2026) లో ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొని పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక చర్చలు జరిపింది. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వివిధ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ పర్యటనలో ఆలివ్ గ్రూప్తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని మంత్రి వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడితో రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,000 కు పైగా హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయి. ఈ అభివృద్ధి రాష్ట్రంలోని పర్యాటక మరియు హాస్పిటాలిటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!